News March 27, 2024
ప.గో.: భౌతికశాస్త్ర ఆచార్యుడి పరిశోధనకు జాతీయస్థాయి గుర్తింపు
తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న మాచవరపు రాముడు చేసిన పరిశోధనకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ‘స్పింట్రానిక్ అనువర్తనాలకు మాంగనీస్ ఆధారిత యాంటీఫేరో మ్యాగ్నెంట్ హ్యుస్లర్’ పదార్థాల అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. దీనికి గాను జాతీయస్థాయి గుర్తింపు రావడంతో భారత ప్రభుత్వ ఆధీనంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు రూ.25లక్షలు కేటాయించింది.
Similar News
News February 7, 2025
మంత్రి నిమ్మలకు 22వ ర్యాంకు పట్ల ఆశ్చర్యం!
ఫైళ్ల క్లియరెన్స్పై CM చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో నిమ్మల రామానాయుడికి 22వ ర్యాంకు లభించడం పట్ల ప.గో జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జలవనరుల శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో నిమ్మల చురుకుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రాజెక్టులు, ఎత్తిపోతలు వంటి అంశాల్లో ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్లో వెనకబడాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
News February 7, 2025
దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్ప్రదేశ్లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు
News February 7, 2025
ఉంగుటూరు: రోడ్డు ప్రమాద మృతులు కృష్ణా జిల్లా వాసులు
ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన <<15374910>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు చనిపోయిన సంగతి విదితమే. మృతులు కృష్ణా(D) బాపులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన దేవ మందిరం, విజయ్ బాబుగా గుర్తించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవ మందిరానికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విజయ్బాబుకి భార్య, ఐటీఐ చదివే కుమారుడు, టెన్త్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.