News October 5, 2024

ప.గో: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ యువతి మృతి

image

నిడదవోలుకు చెందిన దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసుల కథనం..సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫ్రెండ్స్‌తో రాజమండ్రి చూసి వస్తానని శుక్రవారం ఇంట్లో చెప్పి వచ్చింది. 9 మంది 4 బైకులపై బయలుదేరారు. కోరుకొండ నారసింహున్ని దర్శించుకుని వస్తూ.. బూరుగుపూడి జంక్షన్ వద్ద బైకు నడుపుతున్న దీప్తి, టాటా ఏసీని ఢీకొట్టి ప్రాణాలు విడిచింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 5, 2024

APIIC ఛైర్మన్‌గా మంతెన రామరాజు బాధ్యతలు

image

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (APIIC) ఛైర్మన్‌గా మంతెన రామరాజు శనివారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని రామరాజు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన్ను వారు అభినందించారు.

News October 5, 2024

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు

image

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. లీటరు పెట్రోల్ శుక్రవారం, శనివారం రెండు రోజులూ రూ.109.64 ఉంది. దీంతో పాటు డీజిల్ ధరలో కూడా నిన్నటికీ నేటికీ వ్యత్యాసం లేదు. ప్రస్తుతం రూ.97.46 ఉంది.

News October 5, 2024

ఏలూరు: భర్తతో గొడవపడి పుట్టింటికి.. ఆపై చనిపోవాలని విజయవాడకు.!

image

ఏలూరు మండలం పోణంగికి చెందిన అఖిల తన భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో శుక్రవారం చనిపోవాలని 3నెలల బిడ్డతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ వెంటనే స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక గంటలోనే ఆమె విజయవాడలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అక్కడ నుంచి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.