News February 13, 2025
పంచాయతీ ఎన్నికలను సన్నద్ధం కావాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365727887_50200164-normal-WIFI.webp)
గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం నియమించిన స్టేజ్ 1, స్టేజ్ స్టేజ్2 నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక సూచనలు అందించారు.
Similar News
News February 13, 2025
వైట్హౌస్లో పిల్లలతో అధ్యక్షులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739425237692_746-normal-WIFI.webp)
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్హౌస్’కు ఎలాన్ మస్క్ తన చిన్న కుమారుడిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో కొన్నేళ్లుగా అధ్యక్షులు, అధికారుల పిల్లలు సందడి చేయడం కామన్ అయిపోయింది. 2009లో ఒబామా ఇద్దరు కూతుళ్లతో, 1994లో బిల్ క్లింటన్ కూతురు చెల్సీ, 1978లో జిమ్మీ కార్టర్ తన కూతురు అమీతో, 1963లో కెనడీ తన కొడుకుతో కలిసి వైట్హౌస్లో సందడిగా గడిపారు.
News February 13, 2025
గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739428841842_51765059-normal-WIFI.webp)
RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.
News February 13, 2025
పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739429084762_51948758-normal-WIFI.webp)
పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మీనాక్షి కంపెనీ (వేదాంత పవర్), సింహపురి జిందాల్ కంపెనీ, నవయుగ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతినిధులు తెలిపిన పలు సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా మార్గాలపై దిశానిర్దేశం చేశారు.