News August 6, 2024
పటాన్చెరు బస్టాండులో పిల్లలను వదిలేశారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీసీ బస్టాండులో ఇద్దరు చిన్నపిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. సోమవారం సాయంత్రం బస్టాండ్ ప్రాంగణంలో 5ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలను గమనించిన స్వీపర్ సాయంత్రం వరకు వేచి చూశారు. పిల్లల కోసం ఎవరూ రాకపోవడంతో స్వీపర్ పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లారు. ఈరోజు ఉదయం వరకు ఎవరూ రాకపోవడంతో పోలీసులకు అప్పగించారు.
Similar News
News September 30, 2024
ఇందిరాపార్కు ధర్నాలో మెదక్ ఎంపీ రఘునందన్
రైతులకు రుణమాఫీ, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో బీజేపీ ప్రజాప్రతినిధుల 24 గంటల రైతు హామీల సాధన దీక్ష చేపట్టారు. ఈ దీశ్రలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News September 30, 2024
MDK: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
మెదక్: 2720 136 1:20
సంగారెడ్డి: 3352 234 1:14
సిద్దిపేట: 3246 157 1:20
News September 30, 2024
సిద్దిపేట: ‘జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి’
సిద్దిపేట జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 15 వరకు జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని, ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. ముందస్తుగా అనుమతులు తీసుకుని ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని సూచించారు. డీజేల నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు.