News March 3, 2025

పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ 

image

ఉమ్మడి కృష్ణా ,గుంటూరు జిల్లా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం చెప్పారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 700 మంది స్టాఫ్ మూడు షిఫ్టులుగా కౌంటింగ్‌లో పాల్గొంటారని, వారికి ట్రైనింగ్ పూర్తయిందన్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు కౌంటింగ్ జరుగుతుందన్నారు. 

Similar News

News December 26, 2025

ఫ్లాష్.. గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్‌ ఈయనే..!

image

సుమారు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం భర్తీ చేసింది. టీడీపీకి చెందిన కుర్రా అప్పారావును ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవికి చాలామంది ఆశావహులు పోటీపడగా, అధిష్ఠానం కుర్రా అప్పారావును నియమించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News December 26, 2025

గుంటూరు: రూ.53 లక్షల విలువైన సెల్‌ఫోన్ల రికవరీ

image

సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన సెల్‌ఫోన్లను రికవరీ చేసి గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.7.53 కోట్ల విలువైన 3,769 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. సెల్‌ఫోన్ల రికవరీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని SP పేర్కొన్నారు.

News December 26, 2025

GNT: దిగ్గజ నిర్మాత ఏ.వి సుబ్బారావు

image

గుంటూరు జిల్లా అనంతవరంనకు చెందిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏ.వి సుబ్బారావు తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి ఆణిముత్యాలను ఆయన నిర్మించారు. తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రానికి గాను తెలుగులో తొలి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగానే కాకుండా స్టూడియో అధినేతగానూ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అమోఘం.