News February 11, 2025

పదీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News December 15, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

image

<>టాటా<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, NTC, సైన్స్ గ్రాడ్యుయేట్(ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tifr.res.in

News December 15, 2025

GNT: డ్రగ్స్ ముఠా కోసం గాలింపు.. ముగ్గురు అరెస్ట్

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి డ్రగ్స్ అలవాటు చేసిన ముఠాను పట్టుకోవడానికి లాలాపేట పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ ముగ్గురి రక్త నమూనాలను కూడా పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

News December 15, 2025

టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

image

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.