News February 24, 2025

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News February 25, 2025

శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరిన అమరచింత పట్టు వస్త్రాలు

image

మహాశివరాత్రి పురస్కరించుకొని అమరచింత పద్మశాలీలు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పది రోజులపాటు నియమ నిష్టలతో స్వామికి పట్టు వస్త్రాలు నేశారు. పది రోజులపాటు నియమ నిష్ఠలతో నేసిన ఈ పట్టు వస్త్రాలను అమరచింత మహంకాళి శ్రీనివాసులు కవితా రాణి దంపతులు తలపై పట్టు వస్త్రాలను పెట్టుకుని శ్రీశైల మల్లన్నకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సత్యనారాయణ ఎల్లప్ప కడుదాస్ సిద్ధమ్మ పాల్గొన్నారు.

News February 25, 2025

పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి: ADB కలెక్టర్

image

శాసన మండలి ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండో విడత శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే  ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.

News February 25, 2025

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మరణించిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. భవానిపేట వాసి మాగిరి లింగారం(57) తన ద్విచక్ర వాహనంపై చేపలను అమ్మి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రమేశ్ తెలిపారు.

error: Content is protected !!