News March 6, 2025

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా గురువారం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలులోని ఉస్మానియా కళాశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రంలో మెరుగైన వసతులు కల్పించామని అన్నారు. విద్యార్థులకు ఏ అవస్థలు కలగకుండా అన్ని చర్యలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కలెక్టర్ వెంట ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నారు.

Similar News

News March 6, 2025

ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

image

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

News March 6, 2025

కర్నూలు: బొలెరో, బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం

image

నందవరం మండలంలోని జోహారాపురం గ్రామ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ చదువుల చక్రవర్తి(23) వ్యక్తిగత పనుల మీద బైకుపై వెళ్తుండగా పోలకల్ నుంచి రాయచూర్‌కు కందులు తరలిస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో చక్రవర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు జయమ్మ, పోసరప్ప కుమారుడిగా గుర్తించారు.

News March 6, 2025

ఆత్మకూరులో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత

image

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.

error: Content is protected !!