News January 31, 2025

పర్చూరు: భార్య చనిపోయిన నెలకే భర్త మృతి

image

పర్చూరు గ్రామంలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. పర్చూరు 14వ వార్డు మెంబర్, టీడీపీ పర్చూరు పట్టణ అధ్యక్షుడు అగ్నిగుండాల కృష్ణ శుక్రవారం హఠాన్మరణం చెందారు. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మృతి చెందినట్లు టీడీపీ మండల అధ్యక్షుడు షేక్ శంషుద్దీన్ తెలిపారు. కాగా నెల క్రితమే కృష్ణ భార్య అనారోగ్య కారణంగా మృతి చెందింది. అగ్నిగుండాల కృష్ణ మృతితో పర్చూరు గ్రామంలో, టీడీపీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News March 14, 2025

పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

image

రాష్ట్రంలో రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే మంజూరు కాగా, అందులో ఒకటి, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. 

News March 14, 2025

CM గారికి ఇంత అసహనం పనికిరాదు: కవిత

image

TG: BRS MLA జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. ‘ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారు? జగదీశ్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా. ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి, CM గారికి ఇంత అసహనం పనికిరాదు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే సస్పెండ్ చేశారు’ అని ఆరోపించారు.

News March 14, 2025

హోలీ సంబరాల్లో సంగారెడ్డి ఎస్పీ

image

సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు శుక్రవారం నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగులు, పోలీసులు ఎస్పీ రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. సహజమైన రంగులతోనే పండగ జరుపుకోవాలని చెప్పారు. చెరువులు, కుంటల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

error: Content is protected !!