News March 30, 2025
పర్యాటక అభివృద్ధే లక్ష్యం: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు విజన్ 2047ను సాధించాలంటే ఇప్పటి నుంచే పక్క ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక అభిరుద్దితో జిల్లాను ముందంజులో నడపాలన్నారు. అనంతరం సమీక్షా సమావేశంలో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా మహిళా ఉన్నతాధికారులతో కొండపల్లి కోట వద్ద కలెక్టర్ ఫొటో దిగారు.
Similar News
News April 2, 2025
RBI డిప్యూటీ గవర్నర్గా పూనమ్ గుప్తా

దశాబ్దకాలం తర్వాత RBI డిప్యూటీ గవర్నర్గా మహిళ నియమితులయ్యారు. ప్రముఖ ఎకానమిస్ట్ పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో 20 ఏళ్లపాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం. భారత ప్రభుత్వ అడ్వైజర్గా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్(NCAER) డైరెక్టర్గానూ సేవలందించారు. RBI మానిటరీ పాలసీ కమిటీలో పూనమ్ చేరనున్నట్లు తెలుస్తోంది.
News April 2, 2025
నారాయణపేటలో నేషనల్ EMT DAY వేడుకలు

108లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నందుకుగాను ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండో తేదీన నేషనల్ EMT DAY వేడుకలు ఘనంగా నిర్వహిస్తోందని MBNR జిల్లా ప్రోగ్రాం అధికారి రవికుమార్, NRPT జిల్లా సూపర్వైజర్ రాఘవేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News April 2, 2025
కర్నూలు- విజయవాడ విమాన సర్వీసులపై చర్చించిన మంత్రి టీజీ

కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కర్నూలు – విజయవాడ విమాన సౌకర్యంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని టి.జి భరత్ పేర్కొన్నారు.