News May 18, 2024

పల్నాడు: ఎవరిపై వేటు పడుతుందో అని టెన్షన్

image

పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడులో జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కలెక్టర్‌ను బదిలీ చేయడం, SPతో పాటు ఇద్దరు DSPలు, ఇద్దరు CIలు, ఇద్దరు SIలపై వేటు పడింది. ఒకే జిల్లాలో 8 మందిపై వేటు పడటంతో.. అధికారుల్లో టెన్షన్ మొదలైంది. రెండ్రోజుల్లో సిట్ దర్యాప్తు ముగియనుండగా, ఎవరిపై వేటు పడుతుందో అని చర్చించుకుంటున్నారు.

Similar News

News April 23, 2025

10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్‌తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

డిప్యూటీ మేయర్ పదవి ఎవరిని వరించేనో?

image

మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా గుంటూరులోని అధికార పార్టీ నేతల్లో డిప్యూటీ మేయర్ ఆశావాహుల సందడి మొదలైంది. మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి నాని పేరు ఇప్పటికే అధిష్టానం ఖరారు చేయగా, డిప్యూటీ మేయర్ విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. బీసీ వర్గానికి చెందిన యల్లావుల అశోక్ పేరు గట్టిగా వినిపిస్తుండగా, ఇన్‌ఛార్జి మేయర్ సజీల మేయర్ ఎన్నిక తర్వాత పాత పదవిని కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

News April 23, 2025

గుంటూరులో రికవరీ ఏజెంట్ ఆత్మహత్య

image

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్ నగర్లో ఉలవకట్టు ప్రవీణ్ దాస్ (21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ బ్యాంకులో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే ప్రవీణ్ దాస్ మద్యానికి బానిసవ్వడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో ఉరివేసుకున్నాడని తెలిపారు. మృతుని సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

error: Content is protected !!