News April 4, 2025
పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా అశోక్ కుమార్

పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్. అశోక్ కుమార్ నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన డాక్టర్ రంగారావు బదిలీపై గుంటూరు వెళ్లడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం సురేశ్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Similar News
News April 18, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ జిల్లా వ్యాప్తంగా వక్ఫ్ బిల్లు సవరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు ☞ నరసరావుపేట: మంచినీటి కుళాయిల నుంచి రంగు మారిన నీరు ☞ రాజుపాలెం: ఎన్టీఆర్, కోడెల విగ్రహాల ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ☞గురజాల: తిరుమలలో గోరక్షణకు దేవుడే దిగిరావాలి: కాసు మహేష్ ☞ దాచేపల్లి: సోషల్ యాక్టివిస్ట్కు రిమాండ్ విధించిన న్యాయమూర్తి
News April 18, 2025
IPL: టాస్ గెలిచిన పంజాబ్

చిన్నస్వామి స్టేడియంలో వర్షం తెరిపినివ్వడంతో ఎట్టకేలకు టాస్ పడింది. PBKS కెప్టెన్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. 9.45కి మ్యాచ్ మొదలుకానుంది. ఇరు జట్లూ చెరో 14 ఓవర్లు ఆడతాయి.
RCB: సాల్ట్, కోహ్లీ, పాటీదార్, లివింగ్స్టోన్, జితేశ్, డేవిడ్, క్రునాల్, భువీ, హేజిల్వుడ్, దయాళ్, సుయాశ్
PBKS: ప్రియాంశ్, అయ్యర్, ఇంగ్లిస్, వధేరా, స్టొయినిస్, శశాంక్, జాన్సెన్, బ్రార్, చాహల్, బార్ట్లెట్, అర్షదీప్
News April 18, 2025
అమెరికాలో తెలుగమ్మాయి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని గుంటూరుకు చెందిన 24 ఏళ్ల వి.దీప్తి మరణించారు. ఈనెల 12న టెక్సాస్లోని ఇంటి ముందు తన స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుంచి వాహనం వచ్చి ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా దీప్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్నిగ్ధ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీప్తి నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నారు.