News February 13, 2025

పల్నాడు: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్, గుడ్ల ధరలపై ప్రభావం

image

గోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి వదంతులతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ ఫ్లూ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఎక్కడా లేదని, వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా జిల్లాలో చికెన్ ధరలు రూ.50 వరకు తగ్గడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు గుడ్డు ధర కూడా రూ.4.50కి దిగివచ్చింది. మీ ఏరియాలో ధరలెలా ఉన్నాయి.

Similar News

News February 13, 2025

రైతులకు 9 గంటల విద్యుత్ అందాల్సిందే: మంత్రి గొట్టిపాటి

image

AP: వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లులను చెల్లించారనే ఆరోపణలపై ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోష్‌రావును వివరణ కోరారు. ఈ విషయంలో సీఎం అసంతృప్తిని ఎండీకి వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని సూచించారు.

News February 13, 2025

బాపట్ల: స్కానింగ్ సెంటర్లను నిరంతరం తనిఖీ చేయాలి

image

స్కానింగ్ సెంటర్లను వైద్యశాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని బాపట్ల ఆర్డీవో గ్లోరియా చెప్పారు. గురువారం బాపట్ల ఆర్డీవో కార్యాలయం నందు సబ్ డిస్ట్రిక్ లెవల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 13, 2025

కలికిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు మృతి

image

కలికిరి మండలం మహాల్ పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ రఫిక్ ఖాన్ (57), బుజ్జమ్మ (40) అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో రఫిక్ ఖాన్ మృతి చెందాడు. బుజ్జమ్మ రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కలికిరి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!