News February 21, 2025
పల్లె పండుగ పనులు శత శాతం పూర్తికావాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో పల్లె పండుగ కింద మంజూరైన పనులన్ని శత శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్లె పండుగ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా పల్లె పండుగ కింద చేపట్టిన పనులన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అన్నారు.
Similar News
News December 13, 2025
వాటిని పెద్దగా పట్టించుకోను: వైభవ్ సూర్యవంశీ

2025లో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుడిగా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ నిలిచారు. ఈ క్రమంలో పాపులారిటీలో కోహ్లీని కూడా దాటేశారన్న వార్తలపై వైభవ్ స్పందించారు. ‘వీటిని పెద్దగా పట్టించుకోను. నా దృష్టి ఆటపైనే. ఇలాంటి వార్తలు విన్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. వాటిని చూసి ఆనందపడతాను. తర్వాత పనిలో పడిపోతా’ అని చెప్పారు. UAEతో మ్యాచ్లో వైభవ్ 171(95) పరుగులతో <<18542043>>విధ్వంసం<<>> సృష్టించారు.
News December 13, 2025
తంగళ్ళపల్లి: 700 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.
News December 13, 2025
హెచ్పీవీని జాతీయ టీకాల జాబితాలో చేర్చాలి: విశాఖ సీపీ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ను జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో చేర్చాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైతన్య స్రవంతి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు, హోంగార్డుల కుమార్తెలకు (9-14 ఏళ్లు) ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్పై అవగాహన కల్పించేందుకు త్వరలో బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.


