News March 25, 2025
పాడేరు: అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పాడేరు, చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు-7, ఆయాలు-56, మినీ అంగన్వాడీ కార్యకర్తలు-27, పీఎం జనమన్ స్కీంలో కొత్తగా మంజురైన అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలు-24 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈనెల 26 నుంచి వచ్చేనెల 10లోగా ఐసీడీఎస్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 30, 2025
సంగారెడ్డి: 115 ఏళ్ల వృద్ధురాలు మృతి

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బోరంచ గ్రామానికి చెందిన బైండ్ల నాగమ్మ శతాధిక వృద్ధురాలు మరణించారు. ఆమె వయసు 115. ఇప్పట్లో ఇన్నేళ్లు బతకడం చాలా కష్టమని ప్రజలు చెప్పుకుంటున్నారు. అప్పటి వారు చాల గట్టి మనుషులని, ఇప్పటి తరం వారు చిన్న చిన్న వ్యాధులతో మృతి చెందుతున్నారని చెప్పారు. ఇంతకాలం బతకడం అదృష్టమని వివరించారు.
News March 30, 2025
ఇండోనేషియాలోనూ భూకంపం

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైందని ఆ దేశ భూకంప పరిశీలన కేంద్రం తెలిపింది. భూ ఉపరితలానికి 18 కి.మీ లోతున భూకంప కేంద్రం నెలకొని ఉందని పేర్కొంది. థాయ్లాండ్, మయన్మార్ దేశాలను భారీ భూకంపం కుదిపేసిన రోజుల వ్యవధిలోనే తమ వద్దా భూకంపం రావడంతో ఇండోనేషియావాసులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 30, 2025
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

బాపట్ల జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. పంగులూరు మండలం అలవలపాడు గ్రామంలో ఆటో ప్రమాదంలో షేక్ అషీర్ బీ, కొమ్ము సులోచన చనిపోయారు. చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెంలో తాటిచెట్టు పైనుంచి పడి నాగారజు(39) మృతి చెందాడు. చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని కొండేపి సుబ్బారావు, మరో ఘటనలో స్టూవర్టుపురం-బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.