News February 11, 2025

పాడేరు: యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు  

image

బుధవారం జరగాల్సిన(రేపు) ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను యథావిధిగా కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ మంగళవారం తెలియజేశారు. అయితే ఈనెల 11వ తేదీన రద్దు చేసిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని చెప్పారు. >Share it

Similar News

News March 12, 2025

జగన్‌పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

image

AP: మాజీ CM YS జగన్‌పై YCP మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకెళ్తారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు చాలాసార్లు చెప్పినా ఫలితం లేదు. చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టి YCP నుంచి బయటకు వచ్చా. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 12, 2025

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని కొత్తపేట పోలీసులు తెలిపారు. జీజీహెచ్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద వ్యక్తి చనిపోయాడని సెక్యూరిటీ గార్డు కొత్తపేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 12, 2025

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

image

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ఎమ్.సంపూర్ణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంపూర్ణ రావు సతీమణి మార్తమ్మకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్‌లను జిల్లా ఎస్పీ అందజేశారు.

error: Content is protected !!