News August 24, 2024
పాతబస్తీ మెట్రో కోసం 1200 ఆస్తుల సేకరణ
పాతబస్తీ మార్గంలో మెట్రోరైలు కోసం రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జారీ చేశారు. సేకరించాల్సిన ఆస్తులను గుర్తించగానే విడతలవారీగా ప్రకటనలు ఇస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గంలో మెట్రో కోసం 1200 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని హెచ్ఎఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. 8 నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.
Similar News
News September 27, 2024
Tourismకు కేరాఫ్ హైదరాబాద్!
పర్యాటక రంగానికి కేరాఫ్ మన హైదరాబాద్. విదేశీయులు సైతం నిత్యం నగరాన్ని సందర్శిస్తుంటారు. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, 7 టూంబ్స్, ట్యాంక్బండ్, పాతబస్తీలోని చెక్కు చెదరని పురాతన కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి, నూతన సెక్రటేరియట్ నగరంలో కొత్త టూరిస్ట్ స్పాట్లుగా పేరొందాయి. మరి HYDలో మీకు నచ్చిన బెస్ట్ స్పాట్ ఏంటో కామెంట్ చేయండి.
News September 27, 2024
Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!
HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.
News September 27, 2024
సీఎంకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బహిరంగ లేఖ
హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.. మీరు కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.