News April 6, 2025
పాపిరెడ్డి గ్రామానికి రానున్న వైఎస్ జగన్.. రూట్మ్యాప్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 8న రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి హెలీకాప్టర్లో సీకే పల్లి చేరుకుంటారు. 10:50కి సీకే పల్లి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.05 గంటలకు పాపిరెడ్డి గ్రామానికి చేరుకుంటారు. 11.10 వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30కి బెంగళూరుకి తిరుగు పయనమవుతారు.
Similar News
News April 7, 2025
సంక్షేమ వసతి గృహాలలో అంబేడ్కర్ ఉత్సవాలు నిర్వహించాలి

శ్రీ సత్యసాయి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టరేట్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో జయంతి వేడుకలు ఏర్పాట్లకు సన్నాహాలు చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 7, 2025
బీజేపీ సంచలనం.. విరాళాల్లో టాప్

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీలు పొందిన విరాళాలను ADR వెల్లడించింది. అన్ని పార్టీలకు రూ.2544.27 కోట్ల ఫండ్స్ రాగా, అందులో ఒక్క బీజేపీకే రూ.2,243 కోట్లు వచ్చాయి. మొత్తం విరాళాల్లో ఆ పార్టీకే 88శాతం వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.281.48 కోట్ల విరాళం పొందింది. AAP, సీపీఎం, నేషనల్ పీపుల్స్ లాంటి పార్టీలకు తక్కువ విరాళాలు రాగా, తమకు విరాళాలు రాలేదని బీఎస్పీ ప్రకటించింది.
News April 7, 2025
మీరట్ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్

మీరట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. జైలులో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రెగ్నెంట్ అని తేలింది. కాగా మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ను అతడి భార్య ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్తో కప్పేశారు.