News October 8, 2024

‘పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలి’

image

పార్టీ బలోపేతానికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆ జిల్లాల వైసీపీ అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో ఆలూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Similar News

News October 8, 2024

ప్రాణాల మీదకు తెచ్చిన చేపల వేట

image

వెల్దుర్తి మండలం బోగోలుకు చెందిన వెంకటస్వామికి గొంతులో చేప ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. చేపల వేటకు వెళ్లిన అతను చేపను పట్టుకొని నోట్లో పెట్టుకోగా.. పళ్లు లేకపోవడంతో గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో కక్కలేక, మింగలేక అల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాస్పతికి తరలించారు. గొంతులో ఇరుక్కున్న చేపను వైద్యులు బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

News October 8, 2024

శ్రీశైలంలో సినీ హీరో గోపీచంద్ పూజలు

image

దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రాన్ని సినీ హీరో గోపీచంద్ సందర్శించారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై ఆలయం వద్దకు చేరుకున్న గోపీచంద్‌కు అధికారులు ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనలు వళ్లించగా, అధికారులు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.

News October 8, 2024

స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన: మంత్రి భరత్

image

ఐదేళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక ప్రణాళిక (2024-29) రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గ్రోత్ ఇంజిన్ అని, దీని వల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని తెలిపారు. దాదాపుగా రూ.2,800 కోట్లతో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు.