News February 8, 2025
పార్వతీపురం: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు హాల్ టిక్కెట్లు సిద్ధం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738917923882_51732952-normal-WIFI.webp)
పార్వతీపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్న విషయం తెలిసింది. వీరి హాల్ టికెట్లను కళాశాల లాగిన్ లోను, ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్లో పొందుపరిచామని పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి. మంజులవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 8, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738949324761_52052037-normal-WIFI.webp)
రాజానగరం హైవే గైట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బొమ్మూరుకి చెందిన వాకలపూడి వెంకటేశ్వరరావు అతని భార్య రాజేశ్వరి(65)తో కలిసి రాజనగరం మండలం పల్లకడియంలో ఉంటున్న కుమార్తె ఇంటికి స్కూటీపై బయలుదేరారు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమై రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు.
News February 8, 2025
కడప విమానాశ్రయ అభివృద్ధికి కార్యాచరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738929569890_60263330-normal-WIFI.webp)
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి.. కడప విమానాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ విమానాశ్రయ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది.
News February 8, 2025
కరీంనగర్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738975744028_1259-normal-WIFI.webp)
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్లోని ఇందిరానగర్లో జరిగింది. పోలీసుల కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.