News February 24, 2025

పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు

image

పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని DVEO మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 500 మంది ఇన్విజిలేటర్లు, 34 మంది పర్యవేక్షకులు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 24, 2025

PPM: ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లది కీలకపాత్ర

image

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు కీలకపాత్ర అని DRO కె.హేమలత స్పష్టం చేశారు. జవాబుదారీతనం కలిగి సాధారణ పరిశీలకుల నియంత్రణ, పర్యవేక్షణలో సూక్ష్మ పరిశీలకులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. సూక్ష్మ పరిశీలకులు గుర్తించిన అంశాలను సాధారణ పరిశీకులకి సీల్డ్ కవర్‌లో అందించాలని ఆమె పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News February 24, 2025

NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

image

పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయని వెల్లడించారు.

News February 24, 2025

కరీంనగర్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

పట్టభద్రలు, టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

error: Content is protected !!