News April 7, 2025
పార్వతీపురం జిల్లాలో నకిలీ పోలీస్ అరెస్ట్

పోలీసునంటూ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పాలకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ.. ఎస్ఐ అబ్బాయి ఆస్పత్రిలో ఉన్నారని, డబ్బు పంపించాలని వీరఘట్టంలో పలువులు వర్తకులకు ఫోన్ చేసిన వ్యక్తిని సాంకేతిక పరిజ్ఞానంతో బాపట్లలో పట్టుకున్నామన్నారు. సీఐ చంద్రమౌలి, ఎస్ఐలు ప్రయోగమూర్తి, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
విశాఖలో దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్.. పోలీసుల సూచనలు

విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం నిర్వహించే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్కు వచ్చే వారికి పోలీసులు శుక్రవారం పలు సూచనలు చేశారు. వీఐపీ టికెట్లు ఉన్నవారికి మాత్రమే ప్రధాన గేటు ద్వారా ఎంట్రీ ఉంటుందన్నారు. వారి వాహనాలకు లోపల పార్కింగ్ చేసుకోవాలన్నారు. సాధారణ టికెట్లు ఉన్నవారికి పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుంచి ప్రవేశం ఉంటుందన్నారు. వారి వాహనాలు నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్నారు.
News April 18, 2025
GHMC పరిధిలో నమోదైన వర్షపాతం..!

HYDలో భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా రెయిన్బజార్ యాకుత్పురాలో 56.5 మి.మీ, డబీర్పుర బలశెట్టి వాటర్ ట్యాంక్ వద్ద 48.5 మిమీ, దూద్బౌలి 46.5 మిమీ వర్షం నమోదైంది. గన్ఫౌండరీ, రూపాల్ బజార్ 2 చోట్లా 41 మిమీ, నాంపల్లిలో 40.5 మిమీ, అజంపురాలో 38.5 మిమీ, కంచన్బాగ్లో 36.8 మిమీ, ఎడిబజార్లో 33.3 మిమీ, కుత్బుల్లాపూర్ ఆదర్శ్నగర్లో 31.5 మిమీ వర్షపాతం కురిసింది.
News April 18, 2025
అమెరికా వైమానిక దాడి.. యెమెన్లో 74 మంది మృతి

యెమెన్లోని ఆయిల్ పోర్టుపై US చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 74కు చేరింది. ఈ ఘటనలో 171 మంది గాయపడినట్లు హౌతీ గ్రూప్ వెల్లడించింది. నెలరోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇదే అత్యంత దారుణమైన దాడి అని తెలిపింది. కాగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీల దాడులను ట్రంప్ సీరియస్గా తీసుకున్నారు. వారికి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో US ఆర్మీ హౌతీలపై విరుచుకుపడుతోంది.