News April 19, 2025

పార్వతీపురం: ‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

image

రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 8,16,859 మంది రేషన్ కార్డులు దారుల్లో 7,49,481 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని తెలిపారు. 5 ఏళ్ల లోపు వారికి అవసరం లేదు అన్నారు. 54,392 మంది రేషన్ కార్డుదారులు సమీప డీలర్ వద్ద గాని, MDU ఆపరేటర్ వద్ద గాని ఈనెల 30 తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News April 20, 2025

నెల్లూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ప్రారంభం

image

నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సిల్వర్ బాక్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలను అప్సానాతో వెంకటాద్రి నాయుడు, చెస్ రాష్ట్ర కార్యదర్శి సుమన్‌ ఆదివారం ప్రారంభించారు. 280 మంది క్రీడాకారులు 2 ఉభయ రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతకు నగదగతో పాటు, మెమొంటో, ప్రశంసా పత్రం అందజేస్తారని గోపీనాథ్, డాక్టర్ మధు తెలిపారు.

News April 20, 2025

మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా: వైసీపీ

image

AP: మెగా డీఎస్సీపై సంతకం చేసిన 10 నెలలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ Xలో విమర్శించింది. ఇది మెగా డీఎస్సీ కాదు మెగా డిసప్పాయింట్‌మెంట్ అని మండిపడింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎప్పుడు నియామకపత్రాలు ఇస్తారనే విషయమై స్పష్టత లేదని విమర్శించింది. ఈ మెగా డ్రామా పూర్తిగా పబ్లిక్ స్టంట్ అని దుయ్యబట్టింది.

News April 20, 2025

ఉరవకొండ: తమ్ముడి పెళ్లి చూపులకు వెళ్తుండగా విషాదం

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

error: Content is protected !!