News June 21, 2024
పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా..
పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా సంస్థ సంయుక్త సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. శ్యాంబాబు తెలిపారు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండి, పాలిటెక్నిక్, బీటెక్, డిగ్రీ అర్హతలు గల అభ్యర్థులు ముందుగా gdcplkd.ac.in వెబ్సైట్లో పేరు నమోదు చేసుకొని పాస్ ఫోటో, బయోడేటా, అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
Similar News
News October 5, 2024
భువనేశ్వర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం భువనేశ్వర్ విమానాశ్రయం టెర్మినల్-1, 2 భవనాలను పరిశీలించారు. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ప్రస్తుత సామర్థ్యం 4.6 మిలియన్లు ఉండగా.. ఏటా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపడతామని అధికారులకు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.
News October 4, 2024
DGP ద్వారకాతిరుమలరావును కలిసిన ఎంపీ కలిశెట్టి
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP ద్వారకాతిరుమలరావును శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని డీజీపీని ఆహ్వానించారు. అలాగే ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి శాంతిభద్రతలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు.
News October 4, 2024
ప్రజలకు ధన్యవాదాలు: మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ఉత్సవాలను విజయవంతం చేసిన జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం,స్థానిక నాయకులు, ప్రజలకు రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదములు తెలిపారు. ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.