News September 30, 2024
పాలకొండ: విద్యుత్ వైర్ తగిలి మహిళా కూలీ రైతు మృతి
పాలకొండ మండలం పెద్దమంగళాపురం గ్రామానికి చెందిన మహిళా కూలీ రైతు సోమవారం మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలో చెరుకు తోటలో విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్కు గురైన లంక పార్వతి(58) మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 9, 2024
శ్రీకాకుళం: నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలి
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులతో చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు వచ్చే నెల నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.
News October 8, 2024
టెక్కలి: జ్వరంతో స్టాఫ్ నర్స్ మృతి
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా విధులు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మీ(35)అనే మహిళ జ్వరంతో మంగళవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతురాలిది నందిగం మండలం సుభద్రాపురం. స్టాఫ్ నర్స్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలికి భర్త మాధవరావు, ఇద్దరు కుమార్తెలున్నారు.
News October 8, 2024
DSC శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్
SC,ST విద్యార్థులకు ఉచిత DSC శిక్షణ ఇవ్వడానికి శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఇచ్చినందుకు శిక్షణ సంస్థలకు టెండర్ ద్వారా అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన శిక్షణా సంస్థలు వివరాలకు https://tender.apeprocurernant.gov.in పోర్టల్లో డాక్యుమెంట్ నంబర్ 757795ను పరిశీలించి ఈ నెల 21లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.