News September 28, 2024
పాలకొల్లులో మంత్రి నారాయణ రేపటి పర్యటన ఇలా..
మంత్రి నారాయణ ఆదివారం పాలకొల్లులో పర్యటించనున్నారనిి అధికారులు శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లు మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ను పరిశీలిస్తారన్నారు. 10:40కి అబ్దుల్ కలాం పార్క్, 10:50 గంటలకు సీబీఎన్ ఉద్యానవనం, 11 గంటలకు ఎన్టీఆర్ కళాక్షేత్రం, 11:10 గంటలకు అన్న క్యాంటీన్, 12:50 గంటలకు టిడ్కో ఇళ్ల వద్ద ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. 2:30 గంటలకు మున్సిపల్ ఆఫీసులో రివ్యూ నిర్వహిస్తారన్నారు.
Similar News
News September 29, 2024
సెప్టెంబర్ 30న ఉమ్మడి ప.గో. విద్యార్థులకు పోటీలు
ఉమ్మడి ప.గో. జిల్లాలోని విద్యార్థులకు సెప్టెంబర్ 30న ‘సేవ్ ది గర్ల్’ అంశంపై వ్యాసరచన, డెబిట్, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని ఆయా జిల్లాల శాఖ అధికారులు శనివారం తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు చేపడుతున్నామన్నారు. మొదటి విజేతకు రూ.5 వేలు, 2వ విజేతకు రూ.3 వేలు, 3వ విజేతకు 2 వేలను బహుకరిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 1న భీమవరం పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో పోటీలు ఉంటాయన్నారు.
News September 28, 2024
ఏలూరు: వైసీపీ మాజీ MLAపై కేసు నమోదు
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని)పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అవుటుపల్లి నాగమణి అనే మహిళ కోర్టులో ఫిర్యాదు చేయగా.. కోర్టు ఆదేశాల మేరకు ఆళ్ల నాని అతని అనుచరులపై కేసు నమోదు చేశామని శనివారం పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 28, 2024
మంత్రి నిమ్మలను కలిసిన ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు
పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడును ఏపీఐఐసీ ఛైర్మన్గా నియమితులైన ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లాధ్యక్షుడు మంతెన రామరాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామరాజును మంత్రి శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. రామరాజు వెంట ఉండి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఉన్నారు.