News July 8, 2024
పిట్లం: బ్యాంక్ ఉద్యోగం నుంచి గ్రూప్ 1కు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720424339780-normal-WIFI.webp)
పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన దామరంచ అనిల్ గౌడ్ గ్రూప్ 1 మెయిన్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మొదట బ్యాంక్లో క్యాషియర్గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సివిల్స్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక అయి కొన్ని రోజుల పాటు ఎస్సైగా విధులు నిర్వహించాడు. అనంతరం గ్రూప్-2లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం ACTOగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
Similar News
News February 8, 2025
NZB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738991522097_18060220-normal-WIFI.webp)
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
News February 8, 2025
BREAKING: కామారెడ్డి జిల్లాలో తప్పిన భారీ ప్రమాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995163211_718-normal-WIFI.webp)
KMRజిల్లాలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. KMRడిపోకు చెందిన RTCబస్సు భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది వైర్లతో సహా రోడ్డుపై పడింది. ప్రయాణికులు భయపడి బస్సు దిగి పరుగులు తీశారు. వైర్లు ఏ మాత్రం బస్సుపై పడినా భారీ ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే కరెంట్ కట్ అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
News February 8, 2025
BREAKING: నిజామాబాద్: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738991580007_50139228-normal-WIFI.webp)
రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.