News April 12, 2024

పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైనట్లు బుక్కరాయ సముద్రం వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు. అదే విధంగా సీకే పల్లి 41, గుంతకల్ 40.9, తలుపుల 40.8, కదిరి 40.6, యల్లనూరు 40.5, ధర్మవరం, పరిగిలో 40.4, శెట్టూరు 40.3,యాడికి 40.2,కుడేరు, సింగణమలలో గరిష్ఠంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Similar News

News October 9, 2024

ఎరువుల అమ్మకాలు జరిగేలా చర్యలు: కలెక్టర్ డా.వినోద్ కుమార్

image

జిల్లాలోని అన్ని కోఆపరేటివ్ సొసైటీల్లో ఎరువుల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కోఆపరేటివ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 34 కోఆపరేటివ్ సొసైటీలు ఉండగా, అందులో11 సొసైటీలలో ఎరువుల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.

News October 8, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అమడగూరు మండలంలోని సుబ్బయ్య నారవపల్లి గ్రామ సమీపంలో రామలక్ష్మమ్మ (52) అనే వివాహితను ఓ తోటలో దుండగులు హత్య చేశారు. మృతురాలి స్వస్థలం పెనుకొండగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 8, 2024

అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం.. UPDATE

image

అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివారులోని శ్రీనివాస మిల్క్ డైరీ సమీపంలో గల 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన లాలెప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. మృతుడు గుత్తి ఏపీ మోడల్ స్కూలులో అటెండర్‌గా పని చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.