News March 22, 2025
పూడిచెర్లలో ఫారంపాండ్ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ

పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు సూరా రాజన్న పొలంలో ఫారం పాండ్ నిర్మాణ పనులకు శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓర్వకల్లు నుంచే 1.55 లక్షల ఫారంపాండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా, వేదికపైకి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
Similar News
News March 24, 2025
వరంగల్: నగర అభివృద్ధికి సహకరించండి: కమిషనర్

పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే నగర ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి కేవలం 8రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు.
News March 24, 2025
జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా గుమ్మనూరు..?

జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గుమ్మానూరు నారాయణకు బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. విజయవాడలో ఆపార్టీ నేతలతో నారాయణ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో దూకుడైన యువనేత అవసరమని భావిస్తోన్న పార్టీ.. నారాయణకే బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో గుమ్మానూరు కుటుంబానికి బలమైన క్యాడర్ ఉన్న విషయం తెలిసిందే.
News March 24, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్లో 219 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.