News February 21, 2025

పెంచలకోన నరసింహస్వామి సన్నిధిలో మంత్రి ఆనం

image

రాపూరు మండలం పెంచల లక్ష్మీనరసింహస్వామిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వారితోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే కుడిగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Similar News

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో 13వ స్థానంలో నెల్లూరు జిల్లా

image

టెన్త్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా 13వ స్థానంలో నిలించింది. మొత్తం 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు. 14,142 మంది అబ్బాయిలకుగాను 11,510 మంది, అమ్మాయిలు 14,133 మందికిగాను 12,123 మంది పాస్ అయ్యారు. కాగా 83.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

News April 23, 2025

జమ్ములో ఉగ్ర దాడి.. తీవ్రంగా ఖండించిన ఎంపీ

image

జమ్ము కశ్మీర్‌లో మంగళవారం టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరపడం తనను కలిచి వేసిందన్న ఆయన.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. దేశ సరిహద్దులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

News April 23, 2025

పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్ 

image

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలలో తక్కువ బరువు ఉన్న పిల్లలపై అంగన్వాడి సూపర్‌వైజర్లు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతినెల పిల్లల బరువులను, ఎత్తు చూసి రికార్డు చేయాలని సూచించారు. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!