News March 25, 2025

పెంటపాడు: హత్య కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు.. జరిమానా

image

పెంటపాడు (M) ఆకుతీగపాడు గ్రామంలో ఆస్తి తగాదాలను కారణంగా చిన్నం శ్రీనివాస్ తన సోదరుడు వెంకటేశ్వర్లును హత్య చేశాడని స్థానిక ఎస్ఐ స్వామి తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా చిన్నం శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెం 11వ ఏడీజే కోర్టులో సోమవారం హాజరపరిచగా, నేరం నిరూపణ కావడంతో ఏడేళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ షేక్ సికిందర్ తీర్పు వెలువరించారు. పీపీ శివరామకృష్ణ సహకరించారన్నారు.

Similar News

News March 29, 2025

భీమవరం : బాలికపై తండ్రి వరుసయ్యే వ్యక్తి లైంగిక వేధింపులు

image

కన్నతండ్రిలా చూసుకోవాల్సిన వ్యక్తే బాలికపై కన్నేసిన ఘటన భీమవరంలో జరిగింది. 2 టౌన్ SI ఫాజిల్ రెహ్మాన్ కథనం..భర్తతో విడిపోయిన మహిళ ఇద్దరి కుమార్తెలతో.. వచ్చేసి పదేళ్ల నుంచి సత్యవతి నగర్లో కే.గణేశ్‌తో సహజీవనం చేస్తోంది. అతనితోనూ ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆమె ఇంట్లో లేనప్పుడు మొదటి భర్తకు జన్మించిన బాలికను లైంగికంగా వేధించేవాడు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News March 29, 2025

నరసాపురం: ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష, జరిమానా

image

దొంగతనం కేసులో ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై భాస్కరరావు తెలిపారు. నరసాపురం పట్టణానికి చెందిన తిరుమాని చక్రధర్ (చక్రి) 2022 సంవత్సరంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తీ వద్ద నుంచి మొబైల్ చోరీ చేశాడన్నారు. అప్పటి ఎస్ఐ కె.సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. శుక్రవారం నేరం రుజువు కావడంతో ముద్దాయికి జడ్జి 6నెలలు జైలు శిక్ష, రూ.2వేలు ఫైన్ విధించారన్నారు.

News March 29, 2025

ప.గో: సోషల్ పరీక్ష తేదీ మార్పు..డీఈవో

image

పశ్చిమగోదావరి జిల్లాలో మార్చి 31న జరగాల్సిన సోషల్ పరీక్షను ఏప్రిల్ 1కు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు డీఈవో నారాయణ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 31 రంజాన్ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం జరగవలసిన సోషల్ పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీకి మార్చినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు

error: Content is protected !!