News April 4, 2025
పెండింగ్ పనులు పూర్తి చేయాలి: జనగాం కలెక్టర్

ఏప్రిల్ 12లోగా పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో UDID కార్డులు, శాశ్వత మరణాల ఆసరా పెన్షన్ ధృవీకరణ, SHG బీమా, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ఉపాధి పనులు, LRS విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ ఉన్నారు.
Similar News
News April 11, 2025
వెయ్యి రోజులుగా ఆగని పీరియడ్స్.. మహిళ ఆవేదన

తనకు వెయ్యి రోజులుగా రుతుస్రావం అవుతున్నట్లు అమెరికాకు చెందిన టిక్టాకర్ పాపి వెల్లడించారు. 950 రోజుల తీవ్ర ఆవేదన తర్వాత ఆమె ఈ విషయాన్ని తన యూజర్లతో పంచుకున్నారు. మహిళలకు సాధారణంగా నెలలో 3-7 రోజుల పాటు పీరియడ్ బ్లీడింగ్ జరుగుతుంటుంది. మొదట్లోనే టెస్టులు చేయించానని, వైద్యులు సైతం అయోమయంలో పడినట్లు ఆమె తెలిపారు. చివరికి తనకు బైకార్న్యుయేట్ యుట్రస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
News April 11, 2025
నెగటివ్ ప్రచారంపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

సోషల్ మీడియాలో నెగటివిటీని ప్రచారం చేసే వారికి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందని హీరోయిన్ త్రిష ఇన్స్టాలో ప్రశ్నించారు. ఖాళీగా కూర్చొని ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేయడమే పనా అని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారితో కలిసి జీవించేవారి గురించి ఆలోచిస్తే బాధగా అనిపిస్తుందన్నారు. నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పకపోవడంతో SMలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
News April 11, 2025
రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన పొంగులేటి

పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం కూనవరం గ్రామంలో సన్నబియ్యం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుడు వంకా శివలక్ష్మి ఇంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ శుక్రవారం భోజనం చేశారు. పేదల సంక్షేమం కోసమే ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.