News July 2, 2024

పెండ్లిమర్రి: చెట్టుకు ఉరి వేసుకొని యువతి మృతి

image

జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెళ్లటూరు గ్రామానికి చెందిన బత్తల వెంకటలక్ష్మీ (24) అనే యువతి ఎగువచెరువు కాశినాయన గుడి దగ్గర ఉన్న అడవుల్లో ఉరి వేసుకొని మరణించినట్లుగా పెండ్లిమర్రి ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. కానీ మృతికి గల ఎటువంటి  కారణాలు తెలియకపోవడంతో ఇది హత్యనా?, లేక ఆత్మహత్యనా? అనే విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News October 9, 2024

గొప్ప మనసును చాటుకున్న కడప జిల్లా కలెక్టర్

image

ఫిర్యాదుల పట్ల తక్షణ సహాయ సహకారాలు అందిస్తూ కడప కలెక్టర్ శివశంకర్ గొప్ప మనసును చాటుకుంటున్నారు. దువ్వూరు మండలం క్రిష్ణంపల్లికి చెందిన పి. భాగ్యలక్ష్మి తాను ఒంటరి మహిళనని, తనకు సపరేటుగా రేషన్ కార్డు సదుపాయం కల్పించాలని, రేషన్ కోటా తీసుకోలేక పోతున్నానని కలెక్టర్‌కు విన్నవించారు. రేషన్ కార్డు సపరేషన్ ఆప్షన్ లేదని, అంతవరకు తన సొంత ఖర్చుతో బియ్యం, సరుకులు అందిస్తామని చెప్పి వెంటనే ఆమెకు అందించారు.

News October 9, 2024

కాక పుట్టిస్తున్న జమ్మలమడుగు రాజకీయం

image

రెండు రోజుల నుంచి జమ్మలమడుగు రాజకీయం వేడి వాడిగా సాగుతోంది. సుధీర్ రెడ్డి వైడ్ బాల్, MLC రామసుబ్బారెడ్డి నో బాల్ అని MLA ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు. దీనికి ఎమ్మెల్యే ఆది అధికారం ఉంటేనే పులి, అధికారం లేకపోతే పిల్లిలా ఉంటాడంటూ రామసుబ్బారెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. వీళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే 2009 ఎన్నికలు గుర్తుకువస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. వీళ్ల వ్యాఖ్యలపై మీ కామెంట్..

News October 8, 2024

సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయాలి: కడప కలెక్టర్

image

కడప జిల్లాల్లో గ్రామ సభల్లో ఆమోదిందించిన పల్లె ప్రగతికి ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను వచ్చే సంక్రాంతి లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సభలు, పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు తదితర అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ నెల 14వ తేది నుంచి 20వ తేది వరకు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.