News March 17, 2025

పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

పెద్దకొత్తపల్లి మండలం పరిధి దేవుని తిరుమల పూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలానికి చెందిన పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ రాజు అతడి భార్య, కూతురు అనూషతో కలిసి వనపర్తి నుంచి బైక్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరిని ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడగా అనూష అక్కడికక్కడే చనిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 17, 2025

ఖమ్మం: BC గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

బీసీ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 9వ తరగతి (ఇంగ్లిషు మీడియం)లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీ.సీ గురుకుల ఆర్సీఓ సి.హెచ్. రాంబాబు తెలిపారు. ఆసక్తిగల బాల-బాలికలు 150 రూపాయల రుసుముతో ఈ 31లోగా https://mjptbcadmissions .org/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 17, 2025

ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

image

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

News March 17, 2025

రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.

error: Content is protected !!