News April 22, 2025
పెద్దపల్లి: ఆర్ఎంపీలకు వైద్య అధికారిణి హెచ్చరిక

పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎంపీలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి అన్న ప్రసన్న కుమారి పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్ఎంపీలు తమ పరిధిలోనే ఉండాలని, కేవలం ప్రథమ చికిత్సకే పరిమితమవ్వాలని సూచించారు. అనధికారికంగా మేజర్ చికిత్సలు చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News April 23, 2025
నేడే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 23,730 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 23, 2025
‘వేవ్స్’తో మీ ఆలోచనలు పంచుకోండి: చిరంజీవి

ముంబై వేదికగా మే 1 నుంచి 4 వరకు వరల్డ్ విజువల్ ఎంటర్టైన్మెంట్స్ సమ్మిట్(వేవ్స్)ను కేంద్రం నిర్వహించనుంది. ఇది ప్రతిభను నిరూపించుకునే ఓ వేదిక అని వేవ్స్ బోర్డు సభ్యుడు చిరంజీవి చెప్పారు. ఈ సదస్సు నటుల కెరీర్కు టర్నింగ్ పాయింట్ కావొచ్చన్నారు. http://www.wavesindia.org/లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈవెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ప్రొడక్ట్స్ గురించి ఆలోచనలు పంచుకోవాలని కోరారు.
News April 23, 2025
MHBD: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ కాలేజీ విద్యార్థులు

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా మోడల్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో బి.సాయి సుష్మ 462/470(ఎంపీసీ), జె.మధుమిత 426/440(బైపీసీ), ఏ.శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), కే.అనిల్ 839/1000(ఎంపీసీ), కె.మహేశ్వరి 952/1000(బైపీసీ), ఈ.సాయి దుర్గేశ్ 934/1000(సీఈసీ) ఉత్తమ ఫలితాలు సాధించారు.