News March 19, 2025

పెద్దపల్లి: ఈ- హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌పై అవగాహన సదస్సు

image

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు. డేటా ఎంట్రీ చేయుటకు డిజిగ్నేటెడ్ చేయబడిన సిబ్బందికి eHMIS(ఈ – హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పైన శిక్షణ ఇచ్చారు. రోగుల వివరాలు డిజిటలైజేషన్ చేయడానికి ఈ పోర్టల్ ఏర్పాటు చేశారని తెలిపారు.

Similar News

News November 1, 2025

అంతర్గాం పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

image

రామగుండం కమిషనర్ పరిధిలోని అంతర్గాం పోలీస్‌ స్టేషన్ ను సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీశారు.

News November 1, 2025

ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందుకోసం 3,013 RSKలు, 2,061 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ‘ఈసారి 51L టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’ అని పేర్కొన్నారు.

News November 1, 2025

నంద్యాల జిల్లాలో 93.63% పంపిణీ

image

నంద్యాల జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం కింద తొలి రోజు(శనివారం) పింఛన్ల పంపిణీ ముగిసింది. సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 2,14,571 మందికి గానూ 2,00,899 మందికి(93.63%) పింఛన్లు పంపిణీ చేశారు.