News April 22, 2025
పెద్దపల్లి: ఈనెల 30లోపు రాజీవ్ యువ వికాసం వెరిఫికేషన్ పూర్తి: కలెక్టర్

ఈనెల 30 లోపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన రివ్యూ సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. గ్రామాల వారీగా లక్ష్యాల కేటాయింపు ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని సూచించారు. DRDO కాలిందిని, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
‘రాజాసాబ్’ టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ Xలో ట్రెండవుతోంది. ఈ చిత్ర టీజర్ మేలో రాబోతున్నట్లు సినీవర్గాలు పేర్కొనడంతో అభిమానులు దీనిపై ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ సినిమాలో ఇంతవరకూ చూడని విజువల్స్, VFXను టీజర్లో చూపించారని వార్తలొస్తున్నాయి. అయితే, టీజర్ కట్, సీజీ పనులు పూర్తయ్యాయని, ప్రభాస్ డబ్బింగ్ చెప్పడమే మిగిలి ఉందని సమాచారం.
News April 22, 2025
బాపట్ల: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

బాపట్ల జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?
News April 22, 2025
జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కనుగొళ్లు

ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కనుగొళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 385 రైతులకు రూ.1.45 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. 29,056 క్వింటాళ్ల సన్నధాన్యానికి బోనస్ చెల్లించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపి మద్దతు ధర, బోనస్ పోందాలని ఆయన కోరారు.