News April 4, 2025
పెద్దపల్లి: దరఖాస్తుల గడువు పొడగింపు

రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులను ఆఫ్ లైన్లో సంబంధిత మండల పరిషత్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ నందు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల యువకులు నిర్ణిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 18, 2025
MEMU రైలు అనంతపురం వరకు..

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
News April 18, 2025
జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గురువారం జిల్లాలోని మల్లాపూర్లో గరిష్ఠంగా 42.1℃ నమోదైంది. మన్నెగూడెం 41.7, గొల్లపల్లి, అల్లీపూర్ 41.5, గోధూరు, నేరెల్ల 41.2, జైన, మేడిపల్లి 41.0, రాయికల్ 40.8, వెల్గటూర్, బుద్దేష్పల్లి, జగ్గసాగర్ 40.6, సారంగాపూర్ 40.5, కథలాపూర్, ఐలాపూర్ 40.4, పెగడపల్లి 40.3, సిరికొండ 40.2, జగిత్యాల, కోరుట్ల, మారేడుపల్లిలో 40.0℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News April 18, 2025
వేంపల్లెలో బాలికపై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

వేంపల్లెలో ఓ బాలికను ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితులు ఫాజిల్, ఆనంద్ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా నిందుతులకు రిమాండ్ విధించగా కడప సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.