News March 27, 2025

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడేనా..?

image

మద్యం కేసులో MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు సైతం వెళ్లారు. ఈక్రమంలో ఆయన లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతున్న తన తండ్రి పెద్దిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు’ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే MPని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

Similar News

News April 1, 2025

వి.కోట : రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి 

image

వి.కోట – పలమనేరు ప్రధాన రహదారిలో రాఘవపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి చెందాడు. అతను రామకుప్పం మండలం కంచిదాసనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గురుమూర్తిగా సమాచారం. మంగళవారం ఉదయం రాగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. స్థానికులు వి.కోట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

News April 1, 2025

చిత్తూరు: నేడు తెరచుకోనున్న బడులు

image

చిత్తూరు జిల్లాలో నిర్ణయించుకున్న స్థానిక ఐచ్చిక సెలవులు పూర్తిగా వాడుకున్నారని డీఈవో వరలక్ష్మి తెలిపారు. దీంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఎలాంటి సెలవు లేదన్నారు. బడులు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పక విధులకు హాజరు కావాలన్నారు. అలాగే టెన్త్ పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.

News April 1, 2025

నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పెన్షన్లు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,65,067 మంది పెన్షన్ దారులకు రూ.112.79 కోట్లు పెన్షన్లు పంపిణీ చేయునట్లు తెలిపారు.

error: Content is protected !!