News March 13, 2025
పెద్దిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఓ కేసు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి M.R పల్లి మారుతినగర్ పరిధిలో బుగ్గమఠం భూముల ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈ నెల 7న నోటీసులు జారీ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్ట్ను ఆశ్రయించారు. అయితే ఈ భూములకు చెందిన ఎలాంటి పత్రాలు పెద్దిరెడ్డి వద్ద లేవని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమంటూ కోర్ట్ తేల్చి చెప్పింది.
Similar News
News March 13, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 9 నుంచి 17వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల అందరికీ ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
News March 13, 2025
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయం: కేటీఆర్

TG: అనని మాటలు అన్నట్లుగా చూపి జగదీశ్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే సభలో విచారం వ్యక్తం చేస్తామని చెప్పినప్పటికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. రేపు అన్ని నియోజకవర్గాల్లో INC దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
News March 13, 2025
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.