News March 6, 2025

పెరుగుతున్న హనీట్రాప్ బాధితులు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హనీట్రాప్ బాధితులు పెరుగుతున్నారు. పరువుపోతుందనే భయంతో వారు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బ్లాక్ మెయిలింగ్‌తో డబ్బు వసూళ్లకు అలవాటుపడిన సైబర్ నేరగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరించి నిలువుదోపిడీ చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే వీరేశానికి న్యూడ్ కాల్ చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News March 6, 2025

RR: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాసింది ఎందరంటే.?

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 185 సెంటర్లలో 71,684 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా..70,431 మంది విద్యార్థులే హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,253 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 

News March 6, 2025

నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్!

image

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారని తెలిసింది. 338 నామినేషన్లలో 244 వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నాయని నోబెల్ కమిటీ పేర్కొంది. అందులో ఆయన పేరునూ చేర్చామని వెల్లడించింది. సాధారణంగా నామినేట్ అయిన పేర్లను కమిటీ రహస్యంగా ఉంచుతుంది. ఒకవేళ అదే స్వయంగా నామినేట్ చేస్తే చెప్తుంది. శాంతి బహుమతికి ట్రంప్ కన్నా అర్హులు ఇంకెవరూ ఉండరని రిపబ్లికన్ పార్టీ అంటోంది. మీరేమంటారు?

News March 6, 2025

YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ సీఎం జగన్‌పై జనసేన కార్యకర్తలు ఏలూరు(D) ద్వారకా తిరుమల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ అని నిన్న జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!