News October 9, 2024

పొన్నలూరు: విద్యార్థిని మృతి..నలుగురిపై వేటు

image

పొన్నలూరు (మం) ముళ్లమూరివారిపాలెం విద్యార్థి మైథిలి గతనెల 29న రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీనికి సంబంధించి నలుగురి ఉపాధ్యాయులపై డీఈవో సుభద్ర సస్పెండ్ చేశారు. 28న బాలిక పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 ఫుల్ బాల్ పోటీలో పాల్గొని, 29న ఒంగోలుకు చేరుకుంది. బస్టాండు నుంచి ఓ వ్యక్తి బైకుపై వెళుతుండగా..ప్రమాదంలో కన్నుమూసింది. దీంతో క్రీడాకారుల పట్ల సరైన రక్షణ తీసుకోలేదని వేటు వేశామన్నారు.

Similar News

News October 9, 2024

తెలంగాణ డీఎస్సీలో సత్తా చాటిన తర్లుపాడు యువతి

image

తెలంగాణ డీఎస్సీలో తుర్లపాడుకు చెందిన సయ్యద్ రహిమున్ సత్తా చాటారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారు. దీంతో నాన్ లోకల్ కేటగిరీ కింద సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని (ఉర్దూ) గా ఎంపికయ్యారు. తండ్రి టైలర్ కాగా తల్లి గృహిణి. పట్టుదలతో తెలంగాణలో ఉద్యోగం సాధించడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.

News October 9, 2024

ఒంగోలులో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్ష‌ల ప్రయోగశాల: మంత్రి స‌త్య‌కుమార్

image

రాష్ట్రంలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల్ని మ‌రింత‌ పెంపొందించ‌డానికి భార‌త ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల సంస్థతో, ఏపీ ప్ర‌భుత్వం రూ.88.41 కోట్ల‌తో మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌తో కలిసి ఒప్పందప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు. ఒప్పందాలలో భాగంగా ఒంగోలుల‌లో ప్రాథ‌మిక ఆహార ప‌రీక్ష‌ల ప్రయోగశాల రూ. 7.5 కోట్ల‌తో నెల‌కొల్ప‌నున్నాట్లు మంత్రి తెలిపారు.

News October 9, 2024

ప్రకాశం: రైతు బజార్ కేంద్రాల్లో టమాటాలు విక్రయాలు

image

ప్రకాశం జిల్లాలోని అన్ని రైతు బజార్ కేంద్రాలలో నిన్నటి నుంచి రాయితీపై టమాటాలు అందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒక కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నామన్నారు. ఒక కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అందిస్తామని, తమ వెంట ఆధార్ జిరాక్స్ లేదా రేషన్ కార్డు జిరాక్స్‌ను తమ వెంట తీసుకుని రావాలని కోరారు. అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలన్నారు.