News June 27, 2024
పోక్సో కేసులో నేరస్థుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
పోక్సో కేసులో నేరస్థుడికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లాజడ్జి ఎండీ రఫీ బుధవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల వివరాలు.. శంషాబాద్లోని సిద్ధార్థనగర్కు చెందిన నరసింహ నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన బాలికను ప్రేమపేరుతో వంచించాడు. వెళ్లి చేసుకుంటానని బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో 2023 సెప్టెంబర్ 16న ధన్వాడ పీఎస్లో కేసు నమోదు చేశారు.
Similar News
News October 1, 2024
MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక పత్రాల కోసం ఎంపికైన వారు ఎదురుచూస్తున్నారు.
News October 1, 2024
NRPT: డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు
డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు సత్తాచాటారు. 50ఏళ్ల వయసులో రాకొండకు చెందిన జంపుల గోపాల్ తెలుగు పండిట్ కేటగిరిలో జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందారు. ఆయన కుమారుడు భానుప్రకాశ్ నారాయణపేట జిల్లా స్థాయిలో గణితంలో స్కూల్ అసిస్టెంట్ 9వ ర్యాంకు సాధించారు. దీంతో తండ్రీకొడుకులకు ప్రశంసలు వెల్లువెత్తాయి.
News October 1, 2024
MBNR: సర్వం సిద్ధం.. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన
డీఎస్సీ పలితాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, ఎంపికైన అభ్యర్ధుల ఫోన్ కు SMS/మెయిల్ ఐడీకి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, 1:3 నిష్పత్తిలో DEOల వెబ్ సైట్ లో ఉంచుతామని డీఈవోలు తెలిపారు.