News February 26, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు: ఎస్పీ

జిల్లాలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ రూపేష్ బుధవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలని పేర్కొన్నారు. కేంద్రాల సమీపంలో ప్రచారం చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 27, 2025
నేడే ‘MLC’ ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సా.4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
News February 27, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు ADB క్రీడాకారులు

జిల్లా సబ్ జూనియర్ మినీ క్రీడాకారులు రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణించాలని జిల్లా బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు ఫిరంగి అజయ్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లాస్థాయి బేస్ బాల్ సబ్ జూనియర్ మినీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి గజ్వేల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాజశేఖర్, హరిచరణ్, గౌతమ్, రూపేష్, విజయ్ ఉన్నారు.
News February 27, 2025
కడెంలో అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్ పట్టివేత!

అక్రమంగా తరలిస్తున్న ఫర్నీచర్ వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కడెం మండలంలోని గంగాపూర్ నుంచి ట్రాక్టర్ వాహనంలో వడ్ల సంచులు నింపుకొని లోపలి భాగంలో టేకు ఫర్నీచర్ సోఫాసెట్, బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ను ఉంచి తరలిస్తున్నారన్న పక్క సమాచారం మేరకు సెక్షన్ అధికారి కింగ్ ఫిషర్ పట్టుకొని రేంజ్ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.