News March 24, 2025

పోలీస్ కుటుంబాలు నన్ను తిట్టుకుంటున్నాయి: MLA

image

చిత్తూరు జిల్లాలో పోలీసు కుటుంబాలు తనను తిట్టుకుంటున్నాయని పలమనేరు MLA అమర్‌నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య అనంతరం వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని మార్చమని అడిగితే.. SP ఇష్టానికి బదిలీలు చేశారని ఆరోపించారు. దీంతో వారి భార్యా పిల్లలు తనను ద్వేషిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు శాశ్వతం కాదని, అధికారులే శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 28, 2025

హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

image

హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.

News March 28, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. వైసీపీ నేతకు రిమాండ్

image

బాలికపై అత్యాచారం చేసిన కేసులో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు(D)కు చెందిన ఓ బాలిక కలికిరి(M)లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. ఈ ఏడాది జనవరి 25న బాలిక కనపడలేదు. YCP నేత అహ్మద్ పెద్ద కొడుకు జునేద్ అహ్మద్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు.

News March 28, 2025

ఆర్మీలో ఉద్యోగావకాశాలు: చిత్తూరు కలెక్టర్

image

ఆర్మీలో ఉద్యోగాలపై చిత్తూరు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరులో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు మార్చి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 10 చివరి తేదని కలెక్టర్ వెల్లడించారు.

error: Content is protected !!