News March 12, 2025
పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ఎమ్.సంపూర్ణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంపూర్ణ రావు సతీమణి మార్తమ్మకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్లను జిల్లా ఎస్పీ అందజేశారు.
Similar News
News March 12, 2025
NEP అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవు: స్టాలిన్

NEP అమలుతో దేశమంతా హిందీ భాషను అభివృద్ధి చేయాలని బీజేపీ భావిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. దీంతో స్థానిక భాషల గుర్తింపు తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఈ విద్యావిధానం అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవన్నారు. డీలిమిటేషన్తో ఉత్తర భారతంలో ఎంపీల సంఖ్య పెంచి అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని DMK దీనిని అడ్డుకుంటుందని తెలిపారు.
News March 12, 2025
PPM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 426 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు బుధవారం 426 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 8,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 8,172 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,660 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,938 ఒకేషనల్ విద్యార్థులకు 2,707 మంది పరీక్ష రాశారని చెప్పారు.
News March 12, 2025
స్వచ్ఛ ఆంధ్రలో అందరినీ భాగస్వాములు చేయండి: కలెక్టర్

ప్రతి మూడవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందర్నీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుంచి పదవ తరగతి పరీక్షలు, స్వచ్ఛ ఆంధ్ర, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రజల సంతృప్తి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.