News October 10, 2024
ప్రకాశం: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!
అతనో పేద రైతు. ఎంతో కష్టపడ్డాడు. అయినా సరే అప్పులే మిగిలాయి. మరోవైపు ఎదిగి వచ్చిన కుమార్తె పెళ్లి. తప్పనిస్థితిలో మరో రూ.3 లక్షలు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టాడు. అర్ధరాత్రి ఆ నగదును దొంగలు దోచేశారు. ఉదయాన్నే నిద్రలేచిన రైతుకు డబ్బు కనపడకపోవడంతో బోరున విలపించారు. ఈ <<14311035>>బాధాకరమైన<<>> ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లె గ్రామంలోని వీరంరెడ్డి వాసుదేవరెడ్డి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
Similar News
News October 10, 2024
ALERT: పొగాకు ఎక్కువ పండించకండి
టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 16.1 మిలియన్ల పొగాకు కొనుగోళ్లు చేసినట్లు వేలం కేంద్రం అధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కిలో పొగాకు సరాసరి రూ.221లు రైతులకు లభించింది. ఈ ఏడాదికి రూ.279 అందినట్లు చెప్పారు. ప్రస్తుత ధర పోల్చుకుని పొగాకు అత్యధికంగా పండిస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు.
News October 10, 2024
ప్రకాశం: విధులకు వస్తూ MRO మృతి
ప్రకాశం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. అర్ధవీడు మండల MRO కుక్కమూడి దాసు (54) యర్రగొండపాలెం నుంచి విధులకు బయల్దేరగా మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలో ప్రథమ చికిత్స చేసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలిస్తుండగా చనిపోయారు. గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమళ్లపాడు గ్రామం.
News October 9, 2024
మార్కాపురం జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాలపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.