News February 17, 2025

ప్రకాశం: కంభంలో మహిళ ఆత్మహత్య

image

కంభం మండలంలో వ్యాస్మాల్ తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గోవిందాపురానికి చెందిన శ్యామల భర్తతో విడిపోయి కంభంలోని బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరి మధ్య గొడవ కారణంగా మనస్తాపం చెంది ఆదివారం వ్యాస్మాల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కాపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

Similar News

News March 14, 2025

ఒంగోలు: ఇళ్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తుంది. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News March 14, 2025

సంతోషకర వాతావరణంలో హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

image

మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని, ఇబ్బంది కలిగించవద్దని తెలిపారు. సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇలాంటి పండుగల సమయంలో యువత ఆదర్శంగా మెలగాలని సూచించారు.

News March 14, 2025

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

ఒంగోలులో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్‌కు చెందిన సంజీవ కుమార్ ఒంగోలు రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న GRPS పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!