News February 9, 2025
ప్రకాశం జిల్లా పునర్విభజనపై మీ కామెంట్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739074476108_689-normal-WIFI.webp)
అద్దంకిని బాపట్ల, కందుకూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు. ఆ రెండు ఏరియాల ప్రజలకు గతంలో 50KM లోపే జిల్లా కేంద్రం(ఒంగోలు) ఉండేది. ఇప్పుడు ఆ దూరం పెరిగింది. ప్రస్తుతం మార్కాపురాన్ని జిల్లా చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలోనే అద్దంకి, కందుకూరును తిరిగి ప్రకాశంలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ ఏరియాను మార్కాపురం లేదా ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉంచాలో కామెంట్ చేయండి.
Similar News
News February 10, 2025
ప్రకాశం: తండ్రిని చంపిన కొడుకు.. BIG UPDATE
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739154862102_1042-normal-WIFI.webp)
దొనకొండ(M) ఇండ్లచెరువులో <<15406169>>తండ్రిని కొడుకు హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి బానిసైన మరియదాసు రోజూ ఇంట్లో గొడవ పడేవాడు. వారం కిందట భార్య, పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. శనివారం తండ్రి వద్ద డబ్బులు తీసుకుని మరియదాసు తాగి రోడ్డుపై పడిపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి ఏసు ఇంటికి తెచ్చాడు. అర్ధరాత్రి మెలుకువ వచ్చి రంపం బ్లేడుతో నిద్రలో ఉన్న తండ్రిని హత్యచేశాడు.
News February 10, 2025
ప్రకాశం జిల్లా ప్రజలు జాగ్రత్త..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739077696762_928-normal-WIFI.webp)
ప్రకాశం జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న ప్రకాశం జిల్లాలో గరిష్ఠంగా 33.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరినీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 10, 2025
రేషన్ కార్డులు, పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739120018749_52191036-normal-WIFI.webp)
అర్హులైన ప్రతిఒక్కరు నూతన రేషన్ కార్డులకు, పెన్షన్లకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతొక్కరు ఆయాగ్రామల్లో సచివాలయల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి స్వామి తెలిపారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు.