News April 12, 2025

ప్రకాశం జిల్లాకు 16వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16236 మంది పరీక్షలు రాయగా.. 12863 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే 16వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18715 మందికి, 11798 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 19వ స్థానంలో ప్రకాశం జిల్లా నిలిచింది.

Similar News

News April 13, 2025

దర్శి: మహిళ దారుణ హత్య

image

దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. తరువాత అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2025

ప్రకాశం: 2024కి, ఇప్పటికీ 1 స్థానం డౌన్

image

నిన్న ఇంటర్ రిజల్ట్స్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా విద్యార్థులు ఫస్ట్ ఇయర్‌లో 63 శాతం ఉత్తీర్ణతతో 19వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 79 శాతంతో 16వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫస్ట్ ఇయర్‌లో 72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 59 శాతంతో 15వ స్థానంలో నిలిచారు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యార్థులు ఈ ఏడాది, గత ఏడాదికంటే మంచి మార్కులు సాధించిన ర్యాంకుల విషయంలో ఒక స్థానం కిందకి వెళ్లింది.

News April 13, 2025

ప్రకాశం జిల్లా టాపర్లు వీరే!

image

ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు తమ సత్తా చాటి జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంపీసీ గ్రూప్‌లో బండి హర్షిని, కావలి హేమలత, ఎనిమి రెడ్డి సిరి 991/1000 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా, బైపీసీలో పాలకీర్తి హారిక 991/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని కళాశాల బృందం అభినందించింది.

error: Content is protected !!